
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత రాములవారి ఉత్సవమూర్తులతో పాటు సుదర్శన చక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రా.నికి స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం పాల్గొన్నారు.
ఆలయంలో ఏప్రిల్ 11న శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
Leave a Reply