
తిరుమల వారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రుక్మిణీ సమేతంగా కృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.
ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను వారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి వారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.
కాగా, మూడవరోజు భూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు.
ఈ కార్యక్రమంలో టిటిడి పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, వారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply