తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 10వ తేదీ నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ఆధ్యయనోత్సవాలు జరుగుతున్నందున ఈనెల10వ తేదీ శుక్రవారం శ్రీవారి గరుడసేవను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
Leave a Reply