
ఈ నెల 27న తిరుమలలో ఊరేగింపు
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 27వ తేదీ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు జరుగనుంది. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించనున్నారు.
అనంతరం ఈ హారంను అధికారులు ఉదయం 9 గంటలకు తిరుమలలో బయల్దేరి, తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొస్తారు. అనంతరం పసుపు మండపం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు.
నవంబరు 27వ తేదీ సాయంత్రం జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
Leave a Reply