తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) బుధవారం వైభవంగా ముగిసింది.
నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 5 నుంచి 13వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి జరుగనుంది.
నవంబరు 14 నుంచి రుద్రయాగం :
కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 14 నుంచి 24వ తేదీ వరకు కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.
గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply